పొలం కోసం పెట్టిన రక్ష.. రైతుల ప్రాణం తీసింది..!

-

చిన్న పాటి నిర్లక్ష్యం ఏకంగా కొన్ని కొన్ని సార్లు ప్రాణాలమీదికి తెస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఇక్కడ ఇలాంటి ఘటన జరిగింది. చేతికొచ్చిన చెరుకు తోటను అడవి పందులు సహా మరికొన్ని జంతువుల నుంచి కాపాడుకునేందుకు పొలం చుట్టూ విద్యుత్ వైర్లు కట్టాడు ఇక్కడ ఒక రైతు. కానీ ప్రమాదవశాత్తు ఆ విద్యుత్ వైరు తగిలి చివరికి రైతే ప్రాణాలు వదిలాడు. ఈ విషాదకర ఘటన ఖమ్మం జిల్లాలో వెలుగులోకి వచ్చింది.

నేలకొండపల్లి మండలం పోదరుబండలో చెరుకుతోటలో జడలు వేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు విద్యుత్ వైర్లు తగిలి ఆనందరావు అనే రైతు తో పాటు అతని భార్య పార్వతి ఇద్దరు కూడా మృతి చెందారు. అయితే పొలానికి రక్షగా పెట్టినా విద్యుత్ వైర్ ని తొలగించక పోవడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న విద్యుత్ అధికారులు వెంటనే సరఫరాను నిలిపివేశారు. పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పంపించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news