తప్పిన ఘోర రైలు ప్రమాదం.. పట్టాల నుంచి పక్కకెళ్లిన సబర్మతి ఎక్స్ ప్రెస్

-

ఈ మధ్య కాలంలో రైలు ప్రమాదాలు నిత్యం చోటు చేసుకుంటున్నాయి. రైలు పట్టాలు తప్పడం, రైలులో అగ్ని ప్రమాదం సంభవించడం, ఒక రైలు మరో రైలుని ఢీ కొట్టడం ఇలా రకరకాల ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా సబర్మతి ఎక్స్ ప్రెస్ రైలు పట్టాలు తప్పిపోయింది.

శనివారం తెల్లవారుజామున 2.32 నిమిషాలకు ఉత్తర్ ప్రదేశ్ లోని కాన్పూర్ రైల్వే స్టేషన్ సమీపంలో వారణాసి నుంచి అహ్మదాబాద్ కి వెళ్తున్న సబర్మతి ప్యాసింజర్ ఎక్స్ ప్రెస్ పట్టాల నుంచి పక్కకు వెళ్లింది.  గుర్తు తెలియని వ్యక్తులు ట్రాక్ పై  బండరాయి పెట్టడంతో అది గమనించని లోకో పైలెట్ రాయిని బలంగా ఢీ కొట్టాడు. దీంతో  మొత్తం 22 బోగీలు పట్టాలు తప్పి ఒక వైపునకు ఒరిగాయి. ఈ అనుకోని దుర్ఘటనలో చాలా మంది ప్రయాణికులకు స్వల్వగాయలైనట్లుగా అధికారులు వెల్లడించారు. అయితే ఎలాంటి ప్రాణనష్టం వాటిల్లలేదు. ఇక ప్రయాణికులను వారి గమ్య స్థానాలకు చేర్చేందుకు అధికారులు ప్రత్యమ్నాయంగా మరో రైలును ఏర్పాటు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news