రేవంత్ నియోజకవర్గంలో ఘోరం.. చనిపోయిన వ్యక్తిని తోపుడు బండిపై

-

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియోజకవర్గం కొడంగల్ లో దారుణమైన పరిస్థితి నెలకొందని గులాబీ పార్టీ సోషల్ మీడియా వేదికగా.. సంచలన వీడియోను బయటపెట్టింది. అంబులెన్స్ లేక చనిపోయిన వ్యక్తిని తోపుడు బండి పై తరలించారని… ఒక వీడియో బయట పెట్టింది.

revanth
revanth

సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలోనే ఈ పరిస్థితి నెలకొందని గులాబీ పార్టీ ఫైర్ అవుతోంది. కొడంగల్ నియోజకవర్గ నారాయణపేట జిల్లా కోస్గి పట్టణంలో మొగిలయ్య అనే వ్యక్తి ద్విచక్ర వాహనంపై బస్టాండ్ వైపు వెళుతుండగా టిప్పర్ ఢీకొట్టింది. ఈ సంఘటనలో.. అతడు అక్కడికక్కడే మృతి చెందాడు.

ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు… అంబులెన్స్ లేకపోవడంతో ఆ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తోపుడు బండి పై తరలించారు. సంతలో నిమ్మకాయలు విక్రయించేందుకు వచ్చిన ఓ చిరు వ్యాపారికి చెందిన తోపుడు బండిని తీసుకొని వెళ్లారు. దీనిపై గులాబీ పార్టీ ఫైర్ అయింది. సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గం లోని ఇలాంటి పరిస్థితులు నెలకొంటే.. మిగిలిన నియోజకవర్గాలలో… పరిస్థితి ఏంటని నిలదీస్తున్నారు గులాబీ నేతలు.

Read more RELATED
Recommended to you

Latest news