ప్రజ్వల్ ను అరెస్ట్ చేయాలంటూ మహిళల భారీ ర్యాలీ

-

లైంగిక వేధింపుల కేసులో నిందితుడు, ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను అరెస్ట్ చేయాలంటూ వేలసంఖ్యలో మహిళలు రోడ్డుపైకి వచ్చారు. కర్ణాటకలోని హాసన్లో భారీ ర్యాలీ నిర్వహించారు. ప్లకార్డులు చేతబట్టి ప్రజ్వల్ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

కాగా, లైంగిక వేధింపుల ఆరోపణలు రావడానికి ఒకరోజు ముందు ప్రజ్వల్ రేవణ్ణ దౌత్యపరమైన పాస్‌పోర్ట్‌ను ఉపయోగించి ఇండియా నుంచి పారిపోయారు. ఇన్ని రోజులు దేశం విడిచి బయట ఉన్న ప్రజ్వల్ ఇప్పుడు ఇండియాకి తిరిగి వస్తున్నాడు. గురువారం అర్ధరాత్రి తర్వాత బెంగళూరుకు రానున్నాడు.మే 31 ఉదయం 10 గంటలకు సిట్ ముందు హాజరుకానున్నారు. ప్రజ్వల్‌ను అరెస్టు చేయాల్సి వస్తే విమానాశ్రయం నుండే అరెస్టు చేయవచ్చని వార్తలు వినిపిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news