సీఎం జగన్‌పై రాళ్ల దాడి కేసులో కీలక పరిణామం

-

ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై రాళ్ల దాడి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఏ-1 నిందితుడిగా ఉన్న సతీష్‌కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది.రూ.50 వేల షూరిటీతో కండీషనల్ బెయిల్ తో శని, ఆదివారాలు పీఎస్‌లో సంతకం చేయాలని ఆదేశించింది.కాగా, ఇటీవల ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయవాడలో సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్రలో పాల్గొన్నారు. కొందరు ఆగంతకులు పూలతోపాటు రాయి విసరడంతో జగన్ ఎడమ కంటి దగ్గర గాయమైన విషయం తెలిసిందే.

ఈ కేసులో సతీష్‌తో పాటు మరికొందరిపై పోలీసులు కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ప్రస్తుతం జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్న సతీష్‌ వేసిన బెయిల్ పిటిషన్‌పై ఇటీవల విచారణ చేపట్టిన న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసి.. తాజాగా ఇవాళ వెలువరించింది. ఇదిలా ఉంటే… కీలక నిందితుడిగా ఉన్న సతీష్‌కు బెయిల్ రావడం చర్చనీయాంశంగా మారింది. గతంలో జగన్‌పై కోడికత్తితో దాడి చేసిన కేసులో నిందితుడు శ్రీనివాస్‌కు సంవత్సరాలు తరబడి బెయిల్ లభించకపోగా.. సతీష్‌కు మాత్రం వెంటనే బెయిల్ లభించడం పలు అనుమానాలకు దారితీస్తుంది.

 

Read more RELATED
Recommended to you

Latest news