తెలంగాణకు సోనియా రాకపై ఎట్టకేలకు వీడిన సస్పెన్స్..!

-

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీని ఆహ్వానించామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ప్రత్యేకంగా సోనియా గాంధీతో భేటీ అయ్యారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్లు అవుతోన్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న దశాబ్ది ఉత్సవాలకు రావాలని సోనియాగాంధీని ఆయన కోరారు. దీంతో పాటుగా ప్రస్తుతం రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులు, ఇటీవల ముగిసిన లోక్ సభ ఎన్నికల పోలింగ్ సరళిపై ఆమెతో డిస్కస్ చేసినట్లు టాక్. సోనియాతో భేటీ ముగిసిన అనంతరం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.

రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు ఆమెను చీఫ్ గెస్ట్ గా పిలవాలని ఇప్పటికే తెలంగాణ కేబినెట్ తీర్మానించిందని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఈ కార్యక్రమానికి హాజరు కావడంపై సోనియా సానుకూలంగా స్పందించారని తెలిపారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం కృషి చేసిన ఉద్యమకారులను, అమరుల కుటుంబాలను ఈ వేడుకలకు ఆహ్వానిస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news