లవర్ కోసం దొంగగా మారిన యువకుడు.. డమ్మీ పిస్తోల్ తో..

-

శ్రీకాకుళం : ప్రియురాలి కోసం దొంగగా మారాడు ఒడిశా కు చెందిన యువకుడు సూరజ్ కుమార్ కద్రకా. నిన్న ఇచ్ఛాపురంలోని జి.కె జ్యూవెలరీలో చోరీకి పాల్పడిన సూరజ్ కుమార్ …డమ్మీ పిస్తోల్ తో బెదిరించి మూడు గోల్డ్ చెయిన్స్ చోరీ చేసాడు. అయితే చోరీ చేసి పారిపోతుండగా పట్టుకున్నారు స్థానికులు. అనంతరం..సూరజ్ కుమార్ ను పోలీసులకు సారీ అప్పగించారు.

అయితే విచారణలో లవర్ కు గిఫ్ట్ ఇచ్చేందుకే చోరీ చేశానని అంగీకరించాడు సూరజ్ కుమార్. దీంతో కేసు నమోదు చేసుకొని….సూరజ్ కుమార్ ను కోర్టు ముందు హాజరు పరిచారు పోలీసులు. చోరీ కోసం డమ్మీ పిస్తోల్ ను ఫ్లిప్ కార్ట్ లో కొనుగోలు చేసాడు సూరజ్ కుమార్. ఇక నిందితుడి నుంచి డమ్మీ పిస్తోల్ , 90 వేలు విలువ చేసే మూడు గోల్డ్ చైన్లు స్వాధీనం చేసూకున్నామని శ్రీకాకుళం జిల్లా ఎస్పీ అమిత్ బర్ధార్ వెల్లడించారు. ఈ కేసుపై కోర్టు తీర్పు వెలువరించనున్న దని  పేర్కొన్నారు

Read more RELATED
Recommended to you

Latest news