మెగాస్టార్ ఇంట్లో సినీ ప్రముఖుల సమావేశం..

-

మహమ్మారి కారణంగా తీవ్రంగా నష్టపోయిన రంగాలో సినిమా కూడా ఒకటి. థియేటర్లు మూతబడి, షూటింగులు ఆగిపోయి, ఉపాధి లేక తీవ్ర నష్టాన్ని చవిచూసారు. ఈ నేపథ్యంలో సినిమా కార్మికుల కష్టాలను తీర్చడానికి కరోనా క్రైసిస్ ఛారిటీ పేరుతో విరాళాలు సేకరించిన సంగతి తెలిసిందే. ఐతే ప్రస్తుతం సినిమా పెద్దలంతా కలిసి మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో సమావేశం అయినట్లు తెలుస్తుంది. ఈ మేరకు మెగాస్టార్ ఆహ్వానం పలికినట్లు సమాచారం.

నాగార్జున, అల్లు అరవింద్, దిల్ రాజు, ఎన్వీ ప్రసాద్, సురేష్ బాబు, రవి ప్రసాద్, సుప్రియ, ఆర్ నారాయణ మూర్తి, సి కళ్యాణ్, కొరటాల శివ మొదలగు వారంతా ఈ సమావేశానికి హాజరయ్యారు. బీ, సీ సెంటర్లలో టికెట్ ధరలు, థియేటర్లలో విద్యుత్ టారిఫ్, సినీ, థియేటర్ కార్మికుల సమస్యలపై విస్తృతంగా చర్చ జరిపారు. అంతేకాదు సినీ కార్మికుల సమస్యలపై ఏపీ సీఎంతో భేటీ నిర్వహించే విషయంలో చర్చలు సాగాయని తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news