అఫ్గానిస్థాన్​లో వరుస భూకంపాలు.. 26 మంది మృతి

-

ఆఫ్ఘానిస్థాన్‌… ప్రపంచంలోనే ఇప్పుడు అత్యంత ప్రమాదంలో ఉన్న దేశం. గత నాలుగు నెలల కిందట.. అక్కడి ప్రభుత్వాన్ని పడగొట్టి… ఆఫ్ఘానిస్థాన్‌ దేశాన్ని లాక్కున్నారు తాలిబన్లు. దీంతో ఆఫ్ఘానిస్థాన్‌ ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో.. ఆఫ్ఘానిస్థాన్‌ లో తాజాగా సంభవించిన రెండు భూకంప సంఘటనల్లో ఏకంగా 26 మంది ప్రాణాలు వదిలారు.

తుర్కమెనిస్తాన్‌ కు సరిహద్దు ప్రాంతంలోని క్వాదిస్‌, ముకుర్ లో ఈ భూకంపాలు సంభవించాయి. భూ ప్రకంపనలకు ప్రజలు ఒక్క సారిగా భయ భ్రాంతులకు గురయ్యారని.. ఇళ్ల లోంచి బయటకు పరుగులు తీశారని స్థానిక మీడియా సంస్థ పేర్కొంది. పలు ప్రాంతాల్లో సహాయక చర్యలకు వెళ్లిన సిబ్బంది మధ్యలోనే చిక్కుకు పోయారు. మంగళవారం మరిన్ని సహాయక బృందాలను ఘటనా స్థలా లకు పంపనున్నట్లు అధికారులు ప్రకటించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే ఛాన్స్‌ ఉన్నట్లు తెలు స్తోంది. ఆఫ్ఘానిస్థాన్‌ లో జరుగుతున్న  ఈ సంఘటన లపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news