దారుణం.. కారులోకి లాక్కెళ్లి యువతిపై సామూహిక అత్యాచారం!

-

కర్ణాటక రాజధాని బెంగళూరులో ఘోరం చోటుచేసుకుంది.  19 ఏళ్ల యువతిని కారులోకి బలవంతంగా లాక్కెళ్లిన నలుగురు దుండగులు.. ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.  నగరంలోని ఓ పార్కులో తన స్నేహితుడితో కలిసి కూర్చుని ఉండగా అక్కడికి వచ్చిన దుండగులు యువతిని ఎత్తుకెళ్లి ఈ దారుణానికి ఒడిగట్టారు.

ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్న యువతి కోరమంగళ నేషనల్‌ గేమ్స్‌ విలేజ్‌ పార్కు వద్ద గురువారం రాత్రి 9.30గంటల సమయంలో కూర్చొని ఉంది. అక్కడికి వచ్చిన నలుగురు యువకులు ఆమెను బలవంతంగా కారులోకి ఎక్కించి.. కదులుతున్న కారులోనే అఘాయిత్యానికి పాల్పడినట్టు పోలీసులు వెల్లడించారు. ఆ సమయంలో ఆమె పక్కన తన స్నేహితుడు ఉండగా.. అతడిని బెదిరించి యువతిని బలవంతంగా కారులోకి లాక్కెళ్లినట్టు సమాచారం.

మరుసటి రోజు తెల్లవారుజామున 4గంటల సమయంలో తన ఇంటికి సమీపంలోని రోడ్డుపక్కన వదిలి వెళ్లిపోయారని తెలిపింది. ఈ విషయం గురించి పోలీసులకు చెబితే తీవ్ర పరిణామాలు ఉంటాయని బెదిరించారని బాధిత యువతి ఫిర్యాదులో పేర్కొన్నట్టు పోలీసులు తెలిపారు. ఇంటికి చేరుకున్నాక ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం యువతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నలుగురు నిందితులను నగరంలోని ఇజీపురాకు చెందిన సతీశ్‌, విజయ్‌, శ్రీధర్‌, కిరణ్‌లను అరెస్టు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news