తెలంగాణ విద్యార్థులకు బిగ్ షాక్..కాలేజీల్లో ఆధార్‌ బయోమెట్రిక్‌ హాజరు

-

తెలంగాణ విద్యార్థులకు బిగ్ షాక్. అన్ని ఇంజనీరింగ్, వృత్తి విద్య కళాశాలల్లో ఇకనుంచి ఆధార్ అనుబంధ బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి అని జేఎన్టీయూ తెలిపింది. విద్యార్థులు, బోధన సిబ్బంది విధిగా దీన్ని పాటించాలని పేర్కొంది.

ఈ మేరకు అన్ని అనుబంధ కాలేజీలకు జేఎన్టీయూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని, అన్ని కాలేజీలు వెంటనే ఏర్పాట్లు పూర్తి చేసి తమకు సమాచారం అందించాలని జేఎన్టీయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ మంజూర్ హుసేన్ కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news