ఏడు రోజుల తేడాతో అలరించనున్న పవర్ స్టార్, సూపర్ స్టార్.

-

త్వరలోనే టాలీవుడ్ స్టార్ హీరోలు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సూపర్ స్టార్ మహేష్ బాబు చిత్రాలు రాబోతున్నాయి అయితే ఇందులో అసలు ట్విస్ట్ ఏంటంటే ఇవి కొత్త సినిమాలు కాదు.. మరి అసలు విషయం ఏంటి అంటే..

 

ఇప్పుడు ఎక్కడ చూసినా రీ రిలీజ్ మాటే కనిపిస్తుంది.. ఇప్పటికే పలువురు స్టార్ హీరోల చిత్రాలు విడుదలై ప్రేక్షకులను అలరించగా తాజాగా బాలీవుడ్ పవర్ స్టార్ సూపర్ స్టార్ ఎందుకు సిద్ధమవుతున్నారు..

పవన్ కళ్యాణ్ మహేష్ బాబుకు వాళ్ళ కెరియర్లో సూపర్ హిట్గా నిలిచిపోయిన రెండు చిత్రాలు త్వరలోనే మళ్లీ ప్రాక్షకులు ముందుకు రాబోతున్నాయి అవే ఖుషి ఒక్కడు చిత్రాలు..

పవన్ కళ్యాణ్ హీరోగా ఖుషి 2001లో విడుదలైంది.. ఎస్‌జే సూర్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ‘ఖుషి’ సినిమా బిగ్గెస్ట్ క‌మ‌ర్షియ‌ల్ హిట్‌గా నిలిచింది. ఈగో స‌మ‌స్య‌ల చుట్టూ అల్లిన ఈ ప్రేమ‌క‌థ‌లో ప‌వ‌న్ యాక్టింగ్, డైలాగ్ డెలివ‌రీ, మేన‌రిజ‌మ్స్ ప్రేక్ష‌కుల్ని మెప్పించాయి. ఈ సినిమా పవన్ ఇమేజ్ను మరో స్థాయికి తీసుకెళ్లింది.. అయితే డిసెంబ‌ర్ 31న ‘ఖుషి’ రీరిలీజ్ కానుంది. అలాగే వారం రోజులపాటు ఈ సినిమాను థియేటర్లో ప్రదర్శించనున్నట్టు కూడా తెలుస్తోంది..

మ‌హేశ్ ‘ఒక్క‌డు’ సినిమా కూడా థియేట‌ర్ల‌లోకి రానుంది. ఈ సినిమాను జ‌న‌వ‌రి 7న రీరిలీజ్ చేయ‌బోతున్నారు. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ ల‌వ్​స్టోరీగా రూపొందిన ఈ సినిమాకు గుణ‌శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ‘ఖుషి’, ‘ఒక్క‌డు’ అయితే ఈ రెండు సినిమాల్లో భూమిక చావ్లా హీరోయిన్‌గా న‌టించింది.. అయితే ఇద్ద‌రు అగ్ర హీరోల సినిమాల వారం వ్య‌వ‌ధిలో రీరిలీజ్ కావ‌డం టాలీవుడ్‌లో ఆస‌క్తిని రేకెత్తిస్తోంది

Read more RELATED
Recommended to you

Latest news