శ్రీ కృష్ణుడు నిజ రూపాన్ని ఎన్నిసార్లు చూపించారో తెలుసా?

-

కిట్టయ్య లీలామహుడు..ఎప్పుడూ ఎలా ఉంటాడో ఎవరికీ తెలియదు.అయితే తనని నమ్మిన వారిని ఎప్పుడూ కాపాడుతాడు..బాలుడుగా ఉన్నప్పుడు వేపల్లెలో ఓ సారి మన్ను తిన్నాడు. బల రాముడు వెళ్లి యశోదకు చెప్పగా… ఆమె మన్ను ఎందుకు తిన్నావు? అని కృష్ణుణ్ణి గద్దిస్తుంది. అప్పుడు కృష్ణుడు తాను మన్నుతిన లేదంటాడు. తనమాట ఋజువు చేయడానికి నోరు తెరచి, చూపుతాడు. అప్పుడు యశోదకు అతని నోట బ్రహ్మాండమంతా కనిపిస్తుంది. ఇదొక విశ్వరూప ప్రదర్శన. శ్రీ కృష్ణుడు పెరిగి పెద్ద వాడు అయ్యాక కౌరవ పాండవుల మధ్య పొందు కుదర్చడానికి రాయబారిగా హస్తినా నగరానికి పోతాడు.

అతని హితోపదేశం కౌరవుల చెవి కెక్కదు. పైగా వారు కృష్ణుణ్ణి బంధించడానికి కుట్ర పన్నుతారు. అది గ్రహించి కృష్ణుడు అక్కడ తన విశ్వరూపం చూపుతాడు. నారదాది మునులు, భీష్ముడు, ద్రోణుడు, విదురుడు, సంజయుడు వీరికి భగవంతుడు విశ్వరూప దర్శనం అనుగ్రహిస్తారు. ధృతరాష్ట్రునికి తన నిజ స్వరూపాన్ని చూపిస్తాడు.భారత యుద్ధ ప్రారంభ దినాన అర్జునుడు శోకమోహ గ్రస్తుడై యుద్ధం చేయను అంటాడు. భగవంతునికి ఆత్మతత్త్వం బోధిస్తూ… గీతోపదేశం చేస్తాడు. భారత యుద్ధం పూర్తి అయిన తరువాత శ్రీ కృష్ణుడు తిరిగి ద్వారకా నగరానికి ప్రయాణం మవుతాడు..ఆ తర్వాత ఉదంకుడుకు తన నిజ స్వరూపాన్ని చూపించాడు.

నాల్గవ విశ్వరూప ప్రదర్శన.దేవకీపుత్రుడై కారాగారంలో పుట్టినప్పుడు కూడా తల్లిదండ్రులకు తన మహా విష్ణు స్వరూపం ప్రదర్శిస్తాడు. మరొకసారి బ్రహ్మ కృష్ణుడు గోకులంలో పెరిగే సమయంలో లేగలను, గోపబాలురను గుహలో దాచేస్తాడు. కృష్ణుడది గ్రహించి తానే లేగలుగా, గోపబాలురుగా రూపధారచేసి పరిమిత స్థాయిలో విశ్వరూపం చూపించి బ్రహ్మకు గుణపాఠం నేర్పుతాడు. మరొకసారి కంసుని ఆహ్వానం మేరకు అక్రూరునితో మధురానగరికి పోతూ యమునానదిలో స్నానం చేస్తున్న అక్రూరునికి కూడా ఆ నది నీట తన విశిష్ట రూపాన్ని చూపుతాడు..అయితే అతను కొన్ని క్షణాలలో తన నిజ స్వరూపాన్ని చూపిస్తాడు.. ఇవన్నీ భాగవతంలో వివరంగా రాసిఉంది..

Read more RELATED
Recommended to you

Latest news