నిజామాబాద్ జిల్లాలో ఏసీబీకి చిక్కిన అవినీతి చేప..!

-

నిజామాబాద్ జిల్లాలో ఏసీబీకి మరో అవినీతి చేప చిక్కింది. గ్రామ పంచాయతీ కార్యదర్శి లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ  అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు. నందిపేట మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ సెక్రటరీగా పని చేస్తున్న నవీన్ కంఠం.. గ్రామానికి చెందిన సుభాష్ అనే వ్యక్తి వద్ద నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. నందిపేట మండలం కంఠం గ్రామానికి చెందిన సుభాష్ అనే వ్యక్తి తన ఇంటి వివరాల ఆన్ లైన్ కోసం సెక్రటరీ నవీన్ లంచం కోసం డిమాండ్ చేయగా..  బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.

గురువారం గ్రామపంచాయతీ కార్యాలయంలో సుభాష్ సెక్రటరీ నవీన్ కు లంచం డబ్బులు ఇస్తుండగా డీఎస్పీ శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఇటీవలే నిజామాబాద్ నగరంలో మున్సిపల్ కార్పొరేషన్ ఉద్యోగి నరేందర్ ఇంటిపై ఏసీబీ అధికారులు దాడి చేసి దాదాపు మూడు కోట్ల విలువైన నగదును, బంగారు ఆభరణాలు, స్థిరాస్తి పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version