భాకరాపేట ఘాట్ రోడ్డులో లారీ భీభత్సం.. నలుగురు మృతి..!

-

ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి బాకారాపేట రోడ్డు లో లారీ భీభత్సం సృష్టించింది. లోడ్ తో వెళ్తున్నటువంటి లారీ అదుపు తప్పి ఓ కారు పై పడింది. దీంతో కారులో ఉన్నటువంటి నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించినట్టు సమాచారం. మరో ఇద్దరికీ తీవ్ర గాయాలైనట్టు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు. ఘటన జరగడానికి గల కారణాలను తెలుసుకుంటున్నారు. 

అయితే ఈ ఘాట్ రోడ్డు చాలా ప్రమాదకరమైనదని స్థానికులు చెబుతున్నారు. ఇప్పటికే ఈ ఘాట్ రోడ్డులో చాలా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని పేర్కొన్నారు. ఇటీవలే ఓ కర్ణాటక బస్సు బ్రేకులు ఫెయిల్ అయి కొండను ఢీ కొట్టిన విషయం తెలిసిందే. ఈ ఘాట్ రోడ్డు కారు ప్రమాదాలు, బైకు ప్రమాదాలు కొకొల్లలు అనే చెప్పాలి.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version