BREAKING ములుగు జిల్లాలో ప్రమాదం.. ఒకరు స్పాట్ డెడ్

-

ములుగు జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. వివరాల్లోకి వెళితే.. ములుగు జిల్లా వాజేడు మండలం 163 జాతీయ రహదారిపై ఉన్న బీరమయ్య గుడి సమీపంలో బొలెరో వాహనం బోల్తా పడింది. చత్తీస్ ఘడ్ రాష్ట్రం నుండి తెలంగాణ వైపు 23 మంది వలస కూలీలతో వస్తున్న బొలెరో వాహనం మూలమలుపు వద్ద అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో మహిళ మృతి చెందింది. మరో 18 మందికి తీవ్రగాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news