నల్గొండలో ఘోర రోడ్డు ప్రమాదం : ముగ్గురు మృతి

-

ప్రభుత్వాలు ఎన్నిక కఠిన నియమ నిబంధనలు అమలు చేస్తున్నా.. రోడ్డు ప్రమాదాలు మాత్రం తగ్గడం లేదు. రోజు రోజు కు రోడ్డు ప్రమాదాలు ఎక్కువ కావడంమే తప్ప… తగ్గడం లేదు. నిన్న ఏపీలో జరిగిన ఘటన మరువక ముందే… ఇవాళ ఉదయం తెలంగాణ రాష్ట్రం లో మరో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం ముగ్గురిని బలితీసుకుంది. మిర్యాలగూడ – చింతపల్లి హైవేపై ఆగిఉన్న లారీని శ్రీకృష్ణ ట్రావెల్స్‌ బస్సు ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో ఇద్దరు స్పాట్‌లోనే చనిపోగా… ఆస్పత్రికి తరలిస్తుండగా మరొకరు ప్రాణాలు కోల్పోయారు. మరో పది మందికి తీవ్ర గాయాలయ్యాయి. శ్రీకృష్ణ ట్రావెల్స్‌ బస్సు ఒంగోలు నుంచి హైదరాబాద్‌ వస్తుండగా… ఈ ప్రమాదం జరిగింది. గాయపడ్డవారిని మిర్యాలగూడ ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్‌ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగినట్టు భావిస్తున్నారు. ఇటు బస్సు ముందుభాగం నుజ్జునుజ్జవడంతో కొందరు ప్రయాణికులను బయటకు తీయడం కష్టంగా మారింది. ఇంకా ఈ ప్రమాదం వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version