బ్రేకింగ్ : యాదాద్రి కలెక్టర్ కు త్రుటిలో తప్పిన పెను ప్రమాదం

-

తెలంగాణాలో భారీ వర్షాలు, వరదలతో జనజీవనం అస్తవ్యస్తం అయింది. దీంతో అధికారులు అందరూ ఉరుకులు పరుగులు పెడుతూ పని చేస్తున్నారు. కొన్ని చోట్ల నీళ్ళలో మనుషులు చిక్కుకుంటే మరికొన్ని చోట్ల మాత్రం పంటలు భారీగా నాశనం అయ్యాయి. తాజాగా పంట పొలాలను పరిశీలించి తిరిగి వస్తున్న కలెక్టర్ కు త్రుటిలో పెనుప్రమాదం తప్పింది.

వివరాల్లోకి వెళ్తే యాదాద్రి జిల్లా భువనగిరి( మ)అనాజీ పురం సమీపంలో కలెక్టర్ అనిత రామచంద్రన్ కారును లారీ ఢీ కొట్టింది. అయితే ఆ సమయంలో కారులోనే ఉన్నా కలెక్టర్ అనిత రామ చంద్రన్ కి ఏమీ గాయాలు కాలేదు. వలిగొండ మండలంలో పలు గ్రామాల్లో.. అకాల వర్షంతో నష్టపోయిన పంట పొలాలను పరిశీలించి తిరిగి భువనగిరి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. లారీ డ్రైవర్ అతి వేగంగా వస్తూ ఎదురుగా వస్తున్న కారు ఢీ కొట్టినట్టు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news