జగన్ పై రాయితో దాడి కేసులో నిందితుడు సతీష్ కీలక వ్యాఖ్యలు

-

ముఖ్యమంత్రి జగన్ పై రాయితో దాడి కేసులో నిందితుడు సతీష్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ముఖ్యమంత్రిపై జగన్ పై దాడి జరిగిన రోజు రాత్రి మేము కేక్ కట్ చేసుకున్నాం అని తెలిపారు.పోలీసులు వచ్చి ఎందుకు సంబరాలు చేసుకున్నావ్ అని అడిగి పంపించేశారు .

రెండు రోజుల తర్వాత రాత్రి 11 గంటలకు వచ్చి నన్ను పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు.ఇక్కడ నుంచి వంద అడుగుల రోడ్డు వైపు తీసుకెళ్లి తుపాకులు పెట్టి భయపెట్టారు అని,దాడి చేసినట్లు ఒప్పుకుంటే డబ్బులు ఇస్తామని చెప్పారు కాని నేను ఒప్పుకోలేదు అని తెలిపారు. జగన్ పై దాడి జరిగిన స్కూల్ ప్రాంతంలో నేను లేను అని నిందితుడు సతీష్ తెలిపారు. కాగా, ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం జగన్ విజయవాడలో పర్యటిస్తున్న సందర్భంలో గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు . ఈ క్రమంలో వైఎస్ జగన్ కంటికి తీవ్రమైన గాయం అయిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news