పిరికివాడిలా ప్యాలెస్ లో కూర్చొని దొంగలెక్కలు రాస్తున్నారు !

-

ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజు అబద్ధాలతో సీఎం ప్రజలను మాయచేస్తున్నారని ఏపీ టీడీపీ అధ్యక్ష్యుడు అచ్చెనాయుడు అన్నారు. ఎన్నికల ముందు మీ స్వార్థం కోసం చెప్పిన అబద్ధాలు ఇప్పుడు రాష్ట్రానికి శాపంలా మారాయని ఆయన అన్నారు. కేంద్రం మెడలు వంచుతామని ప్రగల్భాలు పలికి రాష్ట్రానికి రావాల్సిన నిధులు కూడా రాబట్టలేకపోయారని ఆయన విమర్శించారు.

మీ స్వప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారని అయన ఆరోపించారు. పోలవరం విషయంలో పిరికి వాడిలా ప్యాలెస్ లో కూర్చొని దొంగలెక్కలు రాసే బదులు ఢిల్లీ వెళ్లి రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఇవ్వమని అడిగి ఉంటే బాగుండేదని ఆయన విమర్శించారు. 17 నెలలుగా రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు జగన్ రెడ్డి పొడిచిన వెన్నుపోట్లు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయన్న అచ్చెన్న హామీలను అమలు చేయకుండా ప్రశ్నించిన బడుగు, బలహీన వర్గాల ప్రజలను తప్పుడు కేసులతో వేధిస్తున్నారని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news