Rana Daggubati: “విరాట‌ప‌ర్వం” కోసం రానా కొత్త అవ‌తారం..!

-

Rana Daggubati: టాలీవుడ్ టాలెంటెడ్ హీరో రానా దగ్గుబాటి వైవిధ్యమైన పాత్రలతో పాన్ ఇండియా యాక్ట‌ర్‌గా గుర్తింపు సంపాదించుకున్నాడు. త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు ఉంటాల‌నే ప‌రిత‌పించే హీరో రానా. ఆయ‌నే హీరోనే కాకుండా నిర్మాత‌గానూ మారిన సంగ‌తి తెలిసిందే. క్యారెట‌ర్ ఏలాంటిదైనా న‌ట‌న‌కు స్కోప్ ఉంటే చాలు దూసుకపోతాడు.

ఈ క్ర‌మంలోనే ఆయ‌న విల‌న్ పాత్ర‌ల్లో కూడా న‌టించి మెప్పించారు. బాహుబలి సినిమాతోపాటు ఓ హిందీ సినిమాలో విలన్‌గా మెప్పించిన విషయం తెలిసిందే. ఇటీవ‌ల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న భీమ్లా నాయక్ మూవీలోనూ విలన్ క‌నిపించ‌నున్నారు. ఇవ‌న్నీ కాకుండా ఇప్పుడు రానా మ‌రో కొత్త అవ‌తారం ఎత్త‌బోతున్నార‌ని ఇండ‌స్ట్రీలో టాక్. అస‌లేంటీ అవ‌తారం అనుకుంటున్నారా?

తొలిసారి వెండితెర ప్రేక్షకులకు తన గొంతును వినిపించేందుకు సిద్ధమైందట.రానా గాయ‌కుడు అవ‌తార‌మెత్తి..విరాట పర్వం (virataparvam) చిత్రంలో ఓ ప్రత్యేక పాట కోసం గొంతు అందివ్వబోతున్న‌డంట‌. వచ్చే వారం ఈ పాటను రికార్డ్ జ‌రుగ‌నున్న‌ద‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ ప్ర‌యోగానికి దర్శకుడు వేణు ఊడుగుల గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. సురేశ్‌బొబ్బిలి ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు.

సోషల్ డ్రామా తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో రానా న‌క్స‌లైట్ పాత్ర‌లో క‌నిపిస్తున్నారు. రానాను ప్రేమించే అమ్మాయి పాత్ర‌లో సాయిప‌ల్ల‌వి న‌టిస్తుంది. ఇప్ప‌టికే రానా పాత్ర‌, సాయిప‌ల్ల‌వి పాత్ర‌ల‌కు సంబంధించిన టీజ‌ర్స్ విడుద‌లై మంచి ఆద‌ర‌ణ‌ను ద‌క్కించుకున్నాయి.

సురేష్ బాబుతో పాటు సుధాక‌ర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం చిత్రీక‌ర‌ణ తుది ద‌శ‌కు చేరుకుంది. ‘విరాట పర్వం’ ప్రధానంగా హైదరాబాద్, వికారాబాద్‌లో చిత్రీకరించారు. ‘విరాట పర్వం’ విడుదల తేదీపై ప్రస్తుతం సస్పెన్స్ ప్రస్తుతం కొనసాగుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news