చంద్రబాబు పాలనపై నటుడు సోనూసూద్ ఆసక్తికర వ్యాఖ్యలు

-

ఏపీలో చంద్రబాబు మార్క్ పాలనపై నటుడు సోనుసూద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తయిన సందర్భంగా సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ఓ వీడియోను పోస్టు చేశారు. చంద్రబాబు ప్రభుత్వానికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. 100 రోజుల పాలనలో చంద్రబాబు మార్క్ కనిపించిందని, ఆయన పాలనలో ప్రజలు సురక్షితంగా, సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు. ఆయన పాలనకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందన్నారు.

రాష్ట్ర భవిష్యత్ కోసం మంచి విజన్‌తో ముందుకు వెళ్తున్నారని, ఇందుకు గర్వంగా ఉందన్నారు. త్వరలోనే మిమ్మల్ని మళ్లీ కలుస్తానని, అధికారంలోకి వచ్చి వంద రోజులు పూర్తైన సందర్భంగా సోనూసూద్ శుభాకాంక్షలు తెలియజేశారు.కాగా, ఏపీలో కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలన పూర్తి అయిన సందర్భంగా..పలువురు ప్రముఖులు విషెస్ చెబుతున్నారు.అంతేగాక వంద రోజుల్లో ప్రజల సంక్షేమం కోసం చంద్రబాబు ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు,వరదల సంక్షోభాన్ని ఎదుర్కొన్న తీరుపై ప్రశంసల వర్షం కురుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news