ఉగ్ర‌వాదుల‌ను మ‌ట్టుబెట్టిన ఇండియ‌న్‌ ఎయిర్ ఫోర్స్‌కు సినీ తార‌ల శాల్యూట్‌..!

-

పుల్వామా దాడిలో 40 మందికి పైగా భార‌త జ‌వాన్ల‌ను పొట్ట‌నబెట్టుకున్న పాక్ ఉగ్ర‌వాదుల‌కు ఇవాళ గ‌ట్టి దెబ్బ త‌గిలింది. ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్ సైనికులు మిరాజ్ 2000 ర‌కానికి చెందిన 12 యుద్ధ విమానాల్లో బ‌య‌ల్దేరి వెళ్లి 1000 కిలోల బాంబుల‌ను ఉగ్ర‌వాదుల శిబిరాల‌పై వ‌దిలారు. దీంతో 300కు పైగా ఉగ్ర‌వాదులు చ‌నిపోయార‌ని తెలిసింది. దీంతో పాక్ ఉగ్ర‌వాదుల పుల్వామా ఘ‌ట‌న‌కు బ‌దులు తీర్చుకున్న‌ట్లు అయింద‌ని యావ‌త్ భార‌త ప్ర‌జ‌లు ఆనందాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. ఉగ్ర‌వాదుల‌కు గ‌ట్టిగా బుద్ధి చెప్పారంటూ అంద‌రూ భార‌త వాయుద‌ళాన్ని అభినందిస్తున్నారు.

కాగా భార‌త్ చేప‌ట్టిన ఈ స‌ర్జిక‌ల్ స్ట్రైక్ 2 ప‌ట్ల అటు ప‌లువురు సినీ తార‌లు కూడా స్పందించారు. భార‌త్ త‌న దెబ్బ‌ను పాక్ ఉగ్ర‌వాదుల‌కు గ‌ట్టిగా రుచి చూపించింద‌ని చెబుతూ, ఇండియ‌న్ ఎయ‌ర్‌ఫోర్స్ సైనికుల‌కు శాల్యూట్ చేస్తున్నారు. ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌ను చూసి తాము గ‌ర్వ‌ప‌డుతున్నామ‌ని రామ్ చ‌ర‌ణ్ పోస్ట్ చేయ‌గా, దేశానికి చెందిన వాయుద‌ళాల‌కు శాల్యూట్ చేస్తున్నాన‌ని క‌మ‌ల హాస‌న్ పేర్కొన్నారు.

Proud of the Indian Air Force ?? Jai Hind ??#IndiaStrikesBack

Posted by Ram Charan on Monday, February 25, 2019

అలాగే సినీ న‌టులు వ‌రుణ్ తేజ్‌, అఖిల్‌, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌, ర‌కుల్ ప్రీత్ సింగ్‌, నితిన్‌, సిద్ధార్థ్‌లు కూడా ట్వీట్ల‌తో ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌కు శాల్యూట్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

Read more RELATED
Recommended to you

Latest news