సినీ నటి హేమ వాయిస్ మెసేజ్ కలకలం.. నరేశ్‌పై తీవ్ర ఆరోపణలు

-

హైదరాబాద్: సినీ నటి హేమా వాయిస్ మెసేజ్ కలకలం రేపుతోంది. మా అధ్యక్షుడు నరేశ్‌పై ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు. మా సభ్యులకు ఆమె ఈ వాయిస్ మెసేజ్ పెట్టారు. ఇప్పుడు ఈ వాయిస్ మెసెజ్  వైరల్ అయింది.

అసలు ఈ వాయిస్‌లో ఏముంది.. హేమ ఆరోపణలు ఏంటో ఒకసారి చూద్దాం..‘‘నరేశ్ కుర్చీ దిగకూడదు.. మా ఎన్నికలు జరగకూడదు. నరేశ్ ఒక్క రూపాయి కూడా సంపాదించలేదు. అసోసియేషన్‌లో ఉన్న ఐదు కోట్లలో రూ. 2.5 కోట్ల దాకా ఖర్చు చేశారు. ఈ ఫండ్‌ను బయట నుంచి ‘మా’కోసం వసూలు చేశాం. ఫండింగ్ డబ్బులన్నీ హ్యాపీగా ఖర్చు పెడుతున్నారు. వచ్చే ఏడాది వరకూ ఐదు కోట్ల నుంచి 0 అకౌంట్ అవుతుంది. కాబట్టి మిగిలిన డబ్బులను మెడిక్లైమ్‌లు, పెన్షన్ల కోసం కట్టాలి. దీనిపై మనం లేఖలు రాయాలి. నరేశ్  ఎన్నికలకు వెళ్లకూడదని ప్రయత్నిస్తున్నారు. మేము ఎన్నికలు కావాలని కోరుకుంటాం. మీరు కూడా కోరుకోండి. ఎలక్షన్ కోసం లెటర్ పంపుతున్నా. ఓకే అని సంతకాలు పెట్టండి. ఈ లెటర్ మా అసోసియేషన్‌కు పంపుతా ఇది కామన్ మెసేజ్. ఈ మేసెజ్‌ను అదరికీ పార్వర్డ్ చేస్తా’’ అని హేమ వాయిస్‌ ఉంది.

 

కాగా మా ఎన్నికలపై కొన్ని రోజులుగా వివాదం నెలకొన్ని విషయం తెలిసిందే. మా ఎన్నికల అధ్యక్ష బరిలో ప్రధానంగా ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు ఉన్నారు. ఇటీవల కాలంలో లోకల్, నాన్ లోకల్ ఇష్యూ దుమారం రేపింది. ఈ నేపథ్యంలో హేమ వాయిస్ బయటకు రావడంతో మా అసోసియేషన్‌లో చర్చనీయాంశంగా మారింది. మరి హేమ ఆరోపణలకు నరేశ్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news