టాలీవుడ్‌లోకి మరో వారసుడు.. దానయ్య తనయుడి ‘అధిర’ ఫస్ట్ స్ట్రైక్ అదిరింది..

-

టాలీవుడ్‌లోకి మరో వారసుడొచ్చేశాడు. ప్రజెంట్ సినీ ప్రియులు, ప్రేక్షక ప్రపంచమంతా ఈగర్‌గా వెయిట్ చేస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ చిత్రాన్ని నిర్మించిన ప్రొడ్యూసర్ డీవీవీ దానయ్య తనయుడు కల్యాణ్ దాసరి హీరోగా తెలుగు వెండితెరకు పరిచయమవుతున్నాడు. శ్రీమతి చైతన్య సమర్పణలో ప్రైమ్ షో ఎంటర్ టైన్మెంట్ బ్యానర్‌పై ప్రొడ్యూసర్ కె.నిరంజన్ రెడ్డి ‘అధిర’ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఈ చిత్రం ద్వారా కల్యాణ్ దాసరి హీరోగా ఇంట్రడ్యూస్ అవుతుండగా, తాజాగా ఫస్ట్ గ్లింప్స్ విడుదల చేశారు మేకర్స్.

adhira
adhira

ఈ ఫస్ట్ స్ట్రైక్ వీడియో చూసి ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ .. డైరెక్టర్ రాజమౌళి హీరోలు తారక్, చెర్రీ ఆనందం వ్యక్తం చేశారు. అతీంద్రియ శక్తులున్న వ్యక్తిగా కల్యాణ్ దాసరి చాలా చక్కగా కనబడుతున్నారు. ‘ఇంద్ర.. దేవేంద్ర..మహేంద్ర..’ అంటూ వస్తున్న బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ద్వారా టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తన ఫిల్మ్ యూనివర్స్‌లోకి తీసుకెళ్తున్నాడు. ఈ చిత్రంలో ‘జగత్ వీరుడిగా.. సూపర్ హీరోగా.. కల్యాణ్ దాసరి కనిపించబోతున్నాడని ఫస్ట్ స్ట్రైక్ వీడియో ద్వారా స్పష్టమవుతోంది. ఇక ఈ ఫస్ట్ స్ట్రైక్ ఈవెంట్‌లో పాల్గొన్న దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి మాట్లాడుతూ కల్యాణ్ దాసరి హ్యాండ్ సమ్‌గా ఉన్నాడని, సినిమా సక్సెస్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో వచ్చిన ‘అ!’ చిత్రం తాను చూశానని, తనకు బాగా నచ్చిందని చెప్పారు. తారక్ మాట్లాడుతూ కొత్త ధోరణిలో మూవీస్ చేస్తూ తనకంటూ ఓ ప్రత్యేకతను ప్రశాంత్ ఏర్పరుచుకున్నాడని పేర్కొన్నారు. ‘అధిర’ కూడా అదే తోవలో వెళ్తుందని అన్నారు. సినిమా తప్పకుండా సక్సెస్ అవుతుందని, ప్రశాంత్ వర్మ్ డైరెక్షన్ లో వచ్చిన ‘జాంబిరెడ్డి, అ!’ చిత్రాలను తాను చూశానని రామ్ చరణ్ చెప్పాడు. ప్రశాంత్ పెక్యులియర్ కాన్సెప్ట్స్ తో సినిమా చాలా కొత్తగా తీస్తారని కొనియాడారు.

Read more RELATED
Recommended to you

Latest news