నేడు ఏపీకి కొత్త సీఎస్ గా బాధ్యతలు స్వీకరించనున్న ఆధిత్యనాద్ దాస్ 

-

ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ ప్రధాన కార్యదర్శిగా ఉన్న నీలం సహాని ఈరోజు రిటైర్ కానున్నారు. ఈ రోజుతో ఆమె పదవీ కాలం ముగుస్తుంది. ఆంధ్రప్రదేశ్ కొత్త చీఫ్ సెక్రటరీగా సీనియర్ ఐఏఎస్ అధికారి ఆదిత్య నాథ్ దాస్ ఈరోజు బాధ్యతలు కూడా స్వీకరించనున్నారు. వెంటనే సీఎస్‌ బాధ్యతల నుంచి నీలం సహాని రిలీవ్‌ కానున్నారు. ఆ వెంటనే సీఎం ముఖ్య సలహాదారుగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఇక ఆమెను కీలకమైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వ్యవహారాల సలహాదారుగా నిర్మించే అవకాశాలు కూడా ఉన్నాయి అని అంటున్నారు.

నిజానికి ఆమె పదవీకాలం ఇప్పటికే ముగిసింది అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమె పదవీకాలాన్ని పొడిగించింది. మరో మారు పదవీ కాలాన్ని పొడిగించే అవకాశాలు లేకపోవడంతో ఆమెకు అత్యున్నత సలహాదారు కట్టబెట్ట నుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఆమెను కేంద్ర రాష్ట్ర సంబంధాల సలహాదారుగా ఆమె బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని మీడియా వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. 

Read more RELATED
Recommended to you

Latest news