ఆ వీడియో చూశాక నా కళ్లలో నీళ్లొచ్చాయి: డైరెక్టర్ ప్రశాంత్ వర్మ

-

ప్రశాంత్ వర్మ.. ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అతడి దర్శకత్వంలో వచ్చిన ‘హనుమాన్’ వసూళ్ల వర్షం కురిపించి శభాష్ అనిపించుకుంది. సంక్రాంతి కానుకగా భారీ అంచనాల మధ్య జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన హనుమాన్ మూవీ ఆడియన్స్ నుండి బ్లాక్ బస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది. కేవలం రూ.75 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ చిత్రం దాదాపు 300 కోట్ల వరకు కలెక్షన్లు రాబట్టింది.

ఈ మూవీతో స్టార్ డైరెక్టర్ల జాబితాలో చేరిన ప్రశాంత్ వర్మ ఓ వీడియోను పోస్ట్ చేసి ఎమోషనల్ అయ్యారు. ‘నేను చిన్నప్పుడు చదివిన పాఠశాల నుంచి సినిమా రిలీజ్కి ముందు ఓ వీడియో వచ్చింది. ఆ వీడియో చూశాక నా కళ్లలో నీళ్లొచ్చాయి’ అని ఆయన ట్వీట్ చేశారు.కాగా, ఈ చిత్రంలో హీరో తేజ సజ్జ ప్రధాన పాత్రలో నటించారు.ఈ సినిమాలో కథానాయికగా అమృతా అయ్యర్ నటించింది. మరో కీలకపాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ నటించింది. ఇక హనుమాన్ మూవీకి సీక్వెల్ రాబోతున్న సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news