ప్రతి ఇంటికీ కేజీ బంగారం, బెంజ్ కారు ఇస్తామంటున్నారు.. నమ్ముతారా ? : సీఎం జగన్

-

తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీల ఉమ్మడి మేనిఫెస్టోపై ముఖ్యమంత్రి జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా అన్నమయ్య జిల్లా కలికిరి నియోజకవర్గంలో మంగళవారం ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కూటమి మేనిఫెస్టో విడుదలకు ముందు ఢిల్లీ నుండి బీజేపీ అధిష్ఠానం చంద్రబాబుకు ఫోన్‌ చేసి, మేనిఫెస్టోలో మీ ఫొటోలు పెట్టుకోండి, ప్రధాని మోడీ ఫొటోలు పెట్టొదని చెప్పారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

చంద్రబాబు హామీలు మోసమని వాళ్లు గుర్తించారని.. అందుకే మేనిఫెస్టో కాపీలపై మోడీ ఫొటో పెట్టేందుకు బీజేపీ ఒప్పుకోలేదని వైఎస్ జగన్ అన్నారు. కూటమిలోని ముగ్గురి ఫొటోలు మేనిఫెస్టో కాపీలపై పెట్టుకునే పరిస్థితి లేదని తెలిపారు. మరోసారి సాధ్యం కానీ హామీలు, సాధ్యం కానీ మాటలతో సూపర్ సిక్స్ అంటున్నారు, సూపర్ సెవెన్ అంటున్నారు.. కూటమి మేనిఫెస్టోను మీరు నమ్ముతారా అని వైఎస్ జగన్ ప్రశ్నించారు.ప్రతి ఇంటికీ కేజీ బంగారం, బెంజ్ కారు ఇస్తామంటున్నారు.. నమ్ముతారా అని ప్రశ్నించారు. 2014లో మోసం చేసిన విధంగానే ప్రజలను మరోసారి మోసం చేయడానికి చంద్రబాబు బరితెగించారు మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news