సీఎం జగన్ రేపటి ప్రచార సభల షెడ్యూల్ ఇదే !

-

ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల ప్రచారములో భాగంగా చేపట్టిన సిద్ధం, మేమంతా బస్సు యాత్రలకి జనం నీరాజనాలు పలికారు. బహిరంగ సభలకు ప్రజలు భారీగా ప్రజలు తరలివచ్చారు. ఇప్పుడు మలి విడత ప్రచారం నిర్వహిస్తున్నారు. రోజుకు 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. రేపు(మే 1) బొబ్బిలి, పాయకరావుపేట, ఏలూరులో ప్రచార సభల్లో వైఎస్ జగన్‌ ప్రసంగించనున్నారు.

వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచార సభల మే 1వ తేదీ షెడ్యూల్‌ను పార్టీ రిలీజ్ చేసింది. బుధవారం ఉదయం 10 గంటలకు విజయనగరం పార్లమెంట్ పరిధిలోని బొబ్బిలిలో మెయిన్ రోడ్ సెంటర్‌లో జరిగే ప్రచార సభలో సీఎం జగన్ పాల్గొననున్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు అనకాపల్లి పార్లమెంట్ పరిధిలోని పాయకరావుపేట నియోజకవర్గంలోని సూర్య మహల్ సెంటర్‌లో జరిగే సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం 3 గంటలకు ఏలూరు పార్లమెంట్ పరిధిలోని ఏలూరు నగరం ఫైర్ స్టేషన్ సెంటర్‌లో జరిగే ప్రచార సభలో సీఎం జగన్ ప్రసంగించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news