తెలంగాణాలో మరో ప్రణయ్ హత్య.. యువతిని ప్రేమిస్తున్నాడని ?

-

ప్రేమ పేరిట, పరువు పేరిట హత్యలు జరగడం సర్వ సాధారణంగా మారింది. అమ్మాయిల పరిస్థితి ఇంకా దారుణం. ప్రేమించకపోతే ప్రేమించలేదని అతను చంపుతాడు, ప్రేమిస్తే తల్లి తండ్రులు చంపుతారు. ఇక అబ్బాయిలను ఏమో అమ్మయిల తల్లితండ్రులు చంపే పరిస్థితి నెలకొంది. తాజాగా కరీం నగర్ జిల్లా వీణవంక మండలం పోతిరెడ్డిపల్లిలో దారుణం జరిగింది.

murder
murder

ప్రణయ్ అనే యువకున్ని గొడ్డళ్ళతో నరికి హత్య చేశారు దుండగులు. పొతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన ప్రణయ్ కి 22 ఏళ్ళు, అతను అదే గ్రామానికి చెందిన యువతిని ప్రేమిస్తున్నాడని గ్రామస్తులు చెబుతున్నారు. ఇటివల అదే అమ్మాయిని పెళ్ళి చేసుకొవాలని ఆ అమ్మాయి తల్లితండ్రులతో అతను మాట్లాడినట్టు చెబుతున్నారు. అది ఇష్టం లేని యువతి కుటుంబ సభ్యులు హత్య చెసి ఉంటారని గ్రామస్థులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news