నిమ్మగడ్డ మీద మరో సారి ప్రివిలేజ్ నోటీసులు ?

-

ఎస్ఈసీ పై మరో ప్రివిలేజ్ నోటీసు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎస్ఈసీ పై ప్రివిలేజ్ కమిటీ కి ఫిర్యాదు చేసే ఆలోచనలో మంత్రి కొడాలి నాని ఉన్నట్టు చెబుతున్నారు. వివరణ ఇచ్చిన తర్వాత కూడా మీడియా ఆంక్షలు విధించటం, కేసు రిజిస్టర్ చేయమని కృష్ణా జిల్లా ఎస్పీకి ఎస్ఈసీ ఆదేశించటాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తున్నట్టు తెలుస్తోంది.

ఇప్పటికే ఈ అంశం మీద కోర్టును కొడాలి నాని ఆశ్రయిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మంత్రులు బొత్స, పెద్దిరెడ్డి ఇచ్చిన సభా హక్కుల ఉల్లంఘన నోటీసుల పై విచారించాలని ప్రివిలేజ్ కమిటీ నిర్ణయించింది.  ఇవాళ, రేపట్లో  ప్రివిలేజ్ నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు. మంత్రి కొడాలి నాని మీద కేసు నమోదు చేయాలని ఎన్నికల సంఘం ఆదేశాలు అధికారికంగా అందలేదు అని కృష్ణా జిల్లా ఎస్పీ పేర్కొన్నారు. అధికారిక ఉత్తర్వులు వచ్చాక దానికి అనుగుణంగా నిర్ణయం తీసుకుంటామని ఆయన అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news