మరో పెళ్ళికి సిద్ధం..ప్రియుడిపై ప్రియురాలి యాసిడ్ దాడి !

-

యూపీలోని ఆగ్రాలో ఆశ్చర్యకరమైన కేసు వెలుగులోకి వచ్చింది. ఒక ప్రియురాలు తన ప్రియుడిపై యాసిడ్ దాడి చేసింది. పరిస్థితి విషమంగా ఉన్న అతన్ని ఆసుపత్రికి తరలించినప్పటికీ, పరిస్థితి విషమించడంతో మరణించారు. అందుతున్న సమాచారం మేరకు తన ప్రియుడు తనని మోసం చేసి వేరే అమ్మాయితో వివాహానికి సిద్ధం కావడంతో నిందితురాలు అతని. ఈ కోపంలో దాడి చేసినట్లు చెబుతున్నారు. ఆగ్రాలోని హరిపర్‌వాట్ ప్రాంతంలో గురువారం ఈ సంఘటన జరిగింది. 

ఆగ్రాలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సు సోనమ్ పాండే, పాథాలజీ ల్యాబ్‌లో సహాయకుడు  దేవేంద్ర కుమార్ ఒకరినొకరు చాలా కాలంగా ప్రేమించుకుంటున్నారని పోలీసులు తెలిపారు. అయితే దేవేంద్ర మరో మహిళని వివాహం చేసుకోబోతున్నాడని ఆమెకి కోపం వచ్చింది. తన గదిలో ఫ్యాన్ చెడిపోయింది దానిని బిగించాలని పిలిచింది. దేవేంద్ర తన ఇంటికి రాగానే, ఆమె అతనిపై యాసిడ్ తో దాడి చేసింది. కాలిన గాయాలతో ఆ వ్యక్తిని సికంద్రలోని ఆసుపత్రిలో చేర్పించారు, అక్కడ అతను చికిత్స పొందుతూ మరణించాడు, దీంతో ఆ మహిళను అరెస్టు చేసినట్లు ఎస్పీ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news