వామ్మో.. ఆ కారుకు రూ. 27. 68 లక్షల జరిమానా.. ఎక్క‌డో తెలుసా..?

-

అహ్మదాబాద్ లో ఖరీదైన పోర్షే కారు. ఈ కారు యజమాని నడుపుకుంటూ రాగా, తనిఖీలు చేస్తున్న పోలీసులు ఆపారు. కారుకు నంబర్ ప్లేట్ లేదు. ఉండాల్సిన ముఖ్యమైన పత్రాలు కూడా లేవు. అయితే ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలపై ఇండియాలో ఈ కారు యజమానికి విధించబడిన అత్యధిక జరిమానా ఇదే. ఇంతకీ.. ఎంత జరిమానా పడిందో తెలుసా? రూ. 27. 68 లక్షలు! అవును మీ విన్న‌ది నిజ‌మే.

తొలుత రూ. 9. 80 లక్షల ఫైన్ వేసిన అధికారులు, ఆరు వారాల తరువాత దాన్ని సమీక్షించారు. జరిమానాను రూ. 27.68 లక్షలకు పెంచుతున్నట్టు తెలిపారు. ఇండియాలో ఇదే అత్యధిక జరిమానా అని అహ్మదాబాద్ పోలీసు అధికారి ఒకరు పేర్కొన్నారు. ఈ క్ర‌మంలోనే వాహనం నడిపే సమయంలో వెహికల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ (ఆర్సీ), ఇన్సూరెన్స్ పేపర్స్, డ్రైవింగ్ లైసెన్స్, పొల్యూషన్ అండర్ కంట్రోల్ (పీయూసీ) సర్టిఫికేట్ తప్పనిసరని ఆయ‌న పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news