త్వరలోనే విజయవాడ నుంచి కర్నూలుకు విమాన సర్వీసులు :మంత్రి టి.జి భరత్

-

విజయవాడ నుంచి కర్నూలుకు త్వరలోనే విమాన సర్వీసులు ప్రారంభిస్తామని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భరత్ అన్నారు.ఢిల్లీలో పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడును మంత్రి టి.జి భరత్ కలిశారు. ఈ సందర్భంగా విజయవాడ నుంచి కర్నూలు ఎయిర్‌పోర్టుకు విమానసౌకర్యం కల్పించాలని, ముఖ్యంగా రాత్రి సమయంలో ఫ్లైట్ ల్యాండింగ్ కోసం తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రిని కోరినట్లు టి.జి భరత్ తెలిపారు.

విజయవాడ నుంచి కర్నూలుకు విమాన సర్వీసులు త్వరలోనే ప్రారంభిస్తామని, సంవత్సరంలోపు రాత్రి సమయాల్లో విమానాలు ల్యాండ్ అయ్యేందుకు కావాల్సిన ఏర్పాట్లు పూర్తి చేయిస్తానని మంత్రి రామ్మోహన్ నాయుడు హామీ ఇచ్చినట్లు తెలిపారు.ఈ మేరకు పనులు ప్రారంభించాలని వెంటనే సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీచేశారని తెలిపారు. కర్నూలుకు విమాన సర్వీసులు అందుబాటులోకి వస్తే ఓర్వకల్లు ఇండస్ట్రియల్ హబ్‌కు పారిశ్రామికవేత్తలు రాకపోకలు సాగించేందుకు సౌకర్యంగా ఉంటుందని ఆయన తెలిపారు.మౌలిక వసతులు కల్పిస్తే ఇండస్ట్రియల్ జోన్‌లో పరిశ్రమలు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ఆసక్తి చూపుతారని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news