ఉస్మానియా మెడికల్ కాలేజీలో గంజాయి కలకలం.. ఇద్దరు అరెస్ట్

-

నగరంలోని ఉస్మానియా మెడికల్ కాలేజీలో గంజాయి కలకలం రేపుతోంది. జూనియర్ డాక్టర్లకు గంజాయి సరఫరా చేస్తున్న ఇద్దరు గంజాయి ఫెడ్లర్ ను తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో , సుల్తాన్ బజార్ పోలీసులు అరెస్ట్ చేశారు.అరెస్టయిన గంజాయి పెడ్లర్ సురేష్ సింగ్ పై గతంలో ఇదివరకే 5 కేసులు నమోదు అయ్యాయి.

జూలై 5న ఉదయం కోఠిలోని ఉస్మానియా మెడికల్ కాలేజీ దగ్గర జూనియర్ డాక్టర్లు వి అరవింద్ ,కె మణికందన్ లు గంజాయి కొనుగోలు చేస్తుండగా పట్టుబడ్డారు. ఆరుగురు మెడికోలు గంజాయి తీసుకున్నట్లు టెస్ట్ లో పాజిటివ్ రావడంతో వారిపై ఇద్దరు మెడికోలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి 80 గ్రాముల గంజాయి , 2 మొబైల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు గంజాయి పెడ్లర్లను,ఇద్దరు జూనియర్ డాక్టర్ లను సుల్తాన్ బజార్ పోలీసులు రిమాండ్ కు తరలించారు. మెడికల్ కాలేజీలో ఇంకా ఎవరైనా గంజాయి తీసుకుంటున్నారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news