డెబిట్ కార్డు కస్టమర్లకు అలర్ట్..అక్టోబర్ నుంచి ఆర్బీఐ కొత్త రూల్స్..

-

బ్యాంక్ ఖాతాదారులకు సైబర్ మోసాల నుంచి రక్షణ కల్పించడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పటికప్పుడు కొత్త రూల్స్ ను అమలు చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే..క్రెడిట్, డెబిట్ కార్డుల వివరాలను సేఫ్​గా ఉంచేందుకు కార్డు టోకనైజేషన్ చేస్తోంది.కార్డ్ హోల్డర్లు తమ కార్డును టోకెన్‌గా మార్చుకోవాలి. ఇప్పుడు వ్యాపారి, చెల్లింపు గేట్‌వే కంపెనీ కార్డ్ చెల్లింపు సమయంలో మీ డేటా, కార్డ్ వివరాలు సేవ్ చేయలేరు. వాటికి బదులుగా వారు టోకెన్ వివరాలను సేవ్ చేస్తారు. అయితే వాటిని మీరే సృష్టించుకుంటారు. దీనికి సంబంధించిన తేదీని ఆర్బీఐ ఖరారు చేసింది. ఇప్పటివరకు వచ్చిన అప్‌డేట్ ప్రకారం ఈ నిబంధన అక్టోబర్ 1 నుంచి అమలులోకి రానుంది.

మీ కార్డ్ ద్వారా చెల్లిస్తే మీ కార్డ్ వివరాలను టోకెన్‌తో భర్తీ చేయాలి. ఈ నియమాన్ని అమలు చేయడానికి కొంత సమయం పడుతుంది. కాబట్టి ముందుగా కార్డ్ టోకనైజేషన్ విధానాన్ని అర్థం చేసుకుందాం. మీరు ఎక్కడైనా కార్డ్ చెల్లింపులను ప్రాసెస్ చేసినప్పుడు ఆ వ్యాపారి ప్లాట్‌ఫారమ్ మీ కార్డ్ నంబర్, మీ CVV, గడువు తేదీ మొదలైన కార్డ్ వివరాలను సులభంగా, వేగవంతమైన చెల్లింపు అనుభవం కోసం డేటాబేస్‌లో స్టోర్‌ చేస్తుంది..ఇది ఇప్పటివరకు ఉన్న పద్దతి..కొన్ని సార్లు అది కూడా చోరీకి గురయ్యె ప్రమాదం కూడా ఉంది..

కార్డ్ ద్వారా చెల్లింపు చేసినప్పుడు టోకెన్‌ను రూపొందించాలి. అప్పుడు వ్యాపారి మీ కార్డ్ వివరాలను సేవ్ చేయలేరు. టోకెన్ వివరాలు మాత్రమే వ్యాపారికి వెళ్తాయి. ఆర్బీఐ నియమం ప్రకారం.. అక్టోబర్ 1, 2022 తర్వాత కార్డ్ హోల్డర్ల కార్డ్ వివరాలను బ్యాంక్ లేదా కార్డ్ జారీ చేసే సంస్థ/నెట్‌వర్క్ తప్ప మరెవరూ సేవ్ చేయలేరు. దీనికి ముందు వినియోగదారులు టోకెన్‌తో కార్డ్ వివరాలను భర్తీ చేయాలి. మీ కార్డును సురక్షితంగా ఉంచే బాధ్యత బ్యాంకులు, కార్డుదారులపైనే ఉంటుంది..ఈ విషయాలను ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి..

Read more RELATED
Recommended to you

Latest news