దిల్ రాజు పై అల్లు అరవింద్ పై చేయి సాధిస్తాడా.!

-

దిల్ రాజు ఈ మధ్య ఏది పట్టుకున్నా కూడా వివాదం లేకుండా నార్మల్ గా పూర్తి కావడం లేదు.గతంలో స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు  స్టార్ హీరో దళపతి విజయ్ తో మన డైరెక్టర్ వంశీ పైడిపల్లి ని తో తమిళ్ లో వారీసు గా తెలుగు లో వారసుడుగా  అత్యంత భారీ స్థాయిలో  సినిమా విషయంలో జరిగిన రచ్చ మామూలు రచ్చ కాదు. ఏమాంటూ ఈ సినిమా మొదలు పెట్టారో గాని దిల్ రాజు చేతలు మాటలు అన్నీ వివాదాలకు దారి తీసిన సంగతి తెలిసిందే.దీనిపై దిల్ రాజు పై బోలెడంత నెగిటివ్ ప్రచారం నడిచింది.

ఇక ఇక లేటెస్టుగా గా దిల్ రాజు అల్లు అరవింద్ తో కయ్యం పెట్టుకున్నట్టు తెలుస్తోంది. గతంలో పరశు రామ్ కు అడ్వాన్స్ ఇచ్చిన అల్లు అరవింద్ తనకు కాకుండా దిల్ రాజు కు సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆగ్రహం వ్యక్తం చేశారని భోగట్టా. దాని మీద ప్రెస్ మీట్ కు కూడా సిద్దం అయినట్లు తెలిసింది.కానీ చివరి నిమిషంలో ప్రెస్ మీట్ క్యాన్సిల్ అయింది. పరశురామ్ తన బ్యానర్ లో సినిమా చేయాల్సింది పోయి దిల్ రాజుతో చేస్తున్నారని అల్లు గొడవ స్టార్ట్ చేసారు.

దిల్ రాజు, పరశురాం తాను గతంలో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన జంట అయిన విజయ్ దేవరకొండ మరియు రాష్మిక మందన్న తో సినిమా చేయాలనే ఆలోచన తో ఉన్నాడట. మళ్లీ గీత గోవిందం  కు సీక్వెల్ చేయాలనే కోరిక తో ఉన్నారట. దానికి ప్రాథమికంగా హీరో, హీరోయిన్స్ అనుమతి తీసుకున్నారని ముందుగా లైన్ చెప్పి ఒకే చేయించు కున్నారని అంటున్నారు. ఇదే అల్లు అరవింద్ ను మండిపోయెల చేస్తోంది. అసలే దిల్ రాజు యవ్వారం నచ్చని అల్లు అరవింద్ ఈ విషయంపై ఎంత దూరం అయినా సరే వెళతా అని అంటున్నారట. అదీ సంగతి.

Read more RELATED
Recommended to you

Latest news