సత్తనపల్లిలో రీపోలింగ్ నిర్వహించాలని కోర్టు మెట్లు ఎక్కిన అంబటి రాంబాబు!

-

అంబటి రాంబాబు కోర్టు మెట్లు ఎక్కారు. సత్తనపల్లి, చంద్రగిరిలోని పలు బూత్ లలో రీపోలింగ్ నిర్వహించాలంటూ అంబటి రాంబాబు, మోహిత్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లను నేడు హైకోర్టు విచారించనుంది.

సత్తెనపల్లిలోని 236, 237, 253, 254 బూత్ లు , చంద్రగిరి లోని 4 కేంద్రాల్లో టీడీపీ నేతలు రిగ్గింగ్ కు పాల్పడ్డారని వారు పేర్కొన్నారు. వైసీపీ ఏజెంట్లపై దాడులు చేశారని తెలిపారు. ఈసీ, సీఈఓతో పాటు పలువురు అధికారులు, టీడీపీ నేతలను ప్రతివాదులుగా చేర్చారు.

ఇక అటు మాచర్ల నియోజకవర్గంలో రీపోలింగ్ నిర్వహించాలని డిమాండ్ తెరపైకి వస్తోంది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాచర్ల నియోజకవర్గంలో ఉన్న ఈవీఎంలు ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అయితే ఈ వీడియో వైరల్ కాగానే పారిపోయారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. ప్రస్తుతం హైదరాబాదులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దాక్కున్నారని సమాచారం. ఇలాంటి నేపథ్యంలో మాచర్ల నియోజకవర్గంలో రీపోలింగ్ నిర్వహించాలని టిడిపి డిమాండ్ చేస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news