రైతుల యాత్ర కాదు.. కొవ్వు ఎక్కిన కోటీశ్వరుల, ఒళ్లు బలిసిన పాదయాత్ర – అంబటి సంచలన వ్యాఖ్యలు

-

రైతుల పాదయాత్రపై అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది రైతుల పాదయాత్ర కాదు ఒళ్ళు బలిసిన వాళ్ళు చేస్తున్న పాదయాత్ర అని చెప్పానని.. ఇదే విషయాన్ని మళ్ళీ మళ్ళీ చెబుతున్నానన్నారు. కొవ్వు ఎక్కిన కోటీశ్వరుల పాదయాత్ర అని.. కడుపు మండిన వారు పాదయాత్ర చేస్తే చంద్రబాబు బాధ్యత వహించాలన్నారు. చంద్రబాబు మూల్యం చెల్లించకోక తప్పదని హెచ్చరించారు.

ఏపీ గురించి మాట్లాడే అర్హత హరీష్ రావు, కేసీఆర్‌కు లేదని చురకలు అంటించారు అంబటి రాంబాబు. యాక్షన్ కు రియాక్షన్ ఉంటుందని..హరీష్ రావు వ్యాఖ్యల పై కౌంటర్ ఇచ్చారు అంబటి. రాష్ట్ర ఆదాయాలు తక్కువగా ఉన్నా అద్భుతంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న రాష్ట్రం ఏపీ అని… మా రాష్ట్రం గురించి మాట్లాడే నైతిక హక్కు, అర్హత హరీష్ రావుకు, కేసీఆర్‌కు లేదని మండిపడ్డారు. తమ రాష్ట్రంలో బలహీనం అయిపోతున్నారా?? రెండు రాష్ట్రాల్లో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమం పై చర్చకు హరీష్ రావు సిద్ధమా?? సవాల్‌ విసిరారు. పోలవరం సర్వనాశనం అయిపోవాలని చంద్రబాబు కోరిక అని.. రాష్ట్రం శ్రీలంకలా అయిపోవాలని కోరిక అని ఫైర్‌ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news