అంబులెన్స్‌లో విహారయాత్ర కు… వీళ్ళు మారరు…

-

ఇప్పుడు జనాలకు అన్నీ కొత్త ఆలోచనలు వస్తున్నాయి. కరోనా లాక్ డౌన్ నుంచి బయట పడటానికి గానూ ఎప్పటికప్పుడు కొత్తగా ఆలోచించే ప్రయత్నం చేస్తున్నారు. ఇందుకోసం ఎన్ని రకాల ఉపాయాలు వాడాలో అన్ని రకాల ఉపాయాలను వాడే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా ఇలాగే వాడి పోలీసులకు దొరికింది ఒక జంట. లాక్ డౌన్ లో బయటకు వెళ్ళడానికి ఏ వాహనం లేదు.

బయటకు రావడం అనేది ప్రస్తుత పరిస్థితుల్లో చాలా కష్టం. అందుకే కొత్తగా పెళ్లి అయిన ఒక జంట… తమకు తెలిసిన ఒక అంబులెన్స్ ని తెప్పించింది. అంబులెన్స్ లో 9 మంది కుటుంబ సభ్యులతో కలిసి ఘజియాబాద్ నుంచి ముజఫర్ నగర్ కి వెళ్ళడానికి రెడీ అయ్యారు. ఎలా అంటే తమకు అనారోగ్యంగా ఉందని చెప్పి ప్రయాణం చేసే ప్రయత్నం చేసారు. వారి మీద పోలీసులకు అనుమానం వచ్చింది.

దీనితో అంబులెన్స్ ని ఆపి విచారణ చేయగా అసలు విషయం బయటపడింది. వారు అందరి మీద కేసులు నమోదు చేసారు. అలాగే వారి మీద అంబులెన్స్ ని దుర్వినియోగం చేసిన కేసు కూడా పెట్టారు. అసలు వాళ్ళు అలా ఎందుకు వెళ్ళారు గురూ అంటే విహారయాత్ర కు బయలుదేరారు. ఏదో గుడి ఉందని ఆ గుడి లో దేవతను కొత్తగా పెళ్లి అయిన వాళ్ళు దర్శించుకుంటే మంచిది అని ఎవరో చెప్పడంతో వెళ్లారట.

Read more RELATED
Recommended to you

Exit mobile version