అమరావతి ఎంపీ నవనీత్ కౌర్ కి చంపేస్తామంటూ బెదిరింపు మెసేజ్

-

మహారాష్ట్ర లోని అమరావతి లోక్‌సభ స్వతంత్ర ఎంపీ, సినీ నటి నవనీత్ కౌరుకి గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు మెసేజ్లు వచ్చాయి. ఆమెను చంపేస్తామంటూ వాట్సప్ లో ఆడియో మెసేజ్ రావడంతో నటి నవనీత్ కౌరు పీఏ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఆమెకు పంపిన ఆడియో క్లిప్‌లో ప్రధాని మోడీ ,కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, ఆరెస్సెస్‌ చీఫ్‌ మోహన్‌ భాగవత్‌లపైనా అభ్యంతరకర పదాలు వాడినట్లు తెలుస్తోంది.నవనీత్‌ రాన ఫోన్‌కు మార్చి 3న బెదిరింపు కాల్స్ వచ్చాయి .ఇక దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటివరకు ఈ కేసు పై ఎవరిని అరెస్టు చేయలేదని పోలీసులు తెలిపారు. మహారాష్ట్రలోని అమరావతి పార్లమెంట్ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా 2019లో నవనీత్ పోటీ చేసి గెలిచారు.ఇక రాబోయే సార్వత్రిక ఎన్నికల్లోనూ ఆమె అమరావతి నుంచే పోటీ చేస్తున్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version