ఆస్తి కోసం అమృత డ్రామాలు…!

-

ప్రణయ్ హత్యా కేసు నిందితుడు మారుతీ రావు అంత్యక్రియలు పూర్తి అయ్యాయి. హైందవ సాంప్రదాయం ప్రకారం అతని అంత్యక్రియలను బంధువులు పూర్తి చేసారు. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు మారుతీ రావు బంధువులు అందరూ అతని కుమార్తె అమృత మీద ఆరోపణలు చేస్తున్నారు. మారుతీ రావు తమ్ముడు శ్రవన్ అమృత పై తీవ్ర ఆరోపణలు చేసాడు. ఆమె ఆస్తి కోసం డ్రామాలు ఆడుతుందని మండిపడ్డారు.

మారుతీ రావును ఉరితీయాలని నిన్నటి వరకు అమృత డిమాండ్ చేసిందని… తండ్రి చస్తే శుభవార్త అందని… ఇప్పుడేమో ఇష్టానుసారం ఆరోపణలు చేస్తోందని మండిపడ్డాడు. నా వల్ల ప్రాణహాని ఉందని నిరూపిస్తే దేనికైనా సిద్ధమని ప్రకటించాడు. మారుతీరావు పోయాక ఆయన ఆస్తిపై ప్రేమ పుట్టుకొస్తోందని ఆరోపించాడు. డబ్బు కోసమే అమృత డ్రామాలు ఆడుతోందన్నాడు. తండ్రి ఆస్తి కోసమే నాపై ఆరోపణలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసాడు ఆయన.

అమృత చేసిన చెత్త పనికే ఇవన్నీ జరిగాయన్నారు. మారుతీ రావును నాన్న అని పిలవడానికి కూడా ఆమెకు మాటలు రావడం లేదని… అన్యాయంగా నన్ను జైలుకు పంపించారని ఆవేదన వ్యక్తం చేసాడు. మళ్లీ నన్ను చంపడానికే ఏవేవో ఆరోపణలు చేస్తున్నారన్నాడు. వాళ్ల అమ్మ వద్దకు అమృత వస్తే తనకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పుకొచ్చారు. అయితే ఇది హత్యా, ఆత్మహత్య అనేది స్పష్టత లేదు.

Read more RELATED
Recommended to you

Latest news