నిర్భయ ఘటన తరహాలో..మానసిక దివ్యాంగురాలిపై అత్యాచారం.. హత్య

-

ఛత్తీస్ గడ్ లోని బాంజ్ గిర్ చంపా జిల్లాలో దారుణమైన సంఘటన కలకలం రేపింది.2012లో దేశవ్యాప్తంగా సంచలనమైన నిర్భయ అత్యాచార ఘటన తరహాలోనే ఇప్పుడు ఛత్తీస్ గడ్ లో మరో దారుణం జరిగింది.ఓ మానసిక దివ్యాంగురాలి పై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ దుండగుడు.అనంతరం బాధితురాలి జననాంగాలలో ఇనుప రాడ్ ను దూర్చి హింసించాడు.దీంతో ఆ మహిళ తీవ్రగాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.ఏప్రిల్ 5వ తేదీన బాధిత మహిళ రోడ్డు ప్రక్కన ప్రమాదకర స్థితిలో స్థానికులకు కనిపించింది.ఆమె శరీరం నిండా గాయాలు ఉన్నాయి. బాధితురాలిని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించగా అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు తెలిపారు.

తొలుత ఈ ఘటనను రోడ్డు ప్రమాదంగా భావించారు ఘటనా స్థలంలోని సీసీ టీవీ ఫుటేజ్ ను పోలీసులు పరిశీలించగా..ఓ యువకుడు మహిళను ఈడ్చుకెళ్లడమ్ కనిపించింది.నిందితుడు దబ్రా ప్రాంతానికి చెందిన కిషన్ యాదవ్ గా గుర్తించారు పోలీసులు.ఏప్రిల్ 9న కిషన్ యాదవ్ ను అదుపులోకి తీసుకున్నారు.పోలీసుల విచారణలో అత్యాచారం తానే చేసినట్లు ఒప్పుకున్నాడు కిషన్.బాధితురాలు కేకలు వేస్తూ అతన్ని నెట్టుకెల్లిందని తెలిపాడు.దీంతో బాధితురాలి జననాంగాలల్లో ఇనుప రాడ్ ని చొప్పించినట్లు తెలిపాడు.తీవ్ర గాయాలు కావడం వల్లనే మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిందని పోలీసుల విచారణలో తేలింది.

Read more RELATED
Recommended to you

Latest news