వైఎస్ షర్మిల పాదయాత్రలో ప్రముఖ యాంకర్

-

వైఎస్‌ ఆర్‌టీపీ అధినే వైఎస్‌ షర్మిల తెలంగాణ రాష్ట్రం లో పాదయాత్ర నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాలనకు వ్యతిరేకంగా… వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీని గద్దె దింపడమే లక్ష్యంగా వైఎస్‌ షర్మిల… ఈ పాదయాత్ర చేస్తున్నారు. దివంగత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి గతంలో… ప్రారంభించిన చేవేళ్ల నియోజక వర్గం నుంచే వైఎస్‌ షర్మిల కూడా తన పాదయాత్ర ను ప్రారంభించింది.

రోజు కు 12 కిలో మీటర్ల చొప్పున పాదయాత్ర చేస్తున్నారు వైఎస్‌ షర్మిల.అయితే… తాజాగా వైఎస్‌ షర్మిల చేస్తున్న పాదయాత్రలో తాజాగా టాలీవుడ్‌ నటి, ప్రముఖ యాంకర్‌ శ్యామల పాల్గొన్నారు. తన భర్తతో కలిసి.. షర్మిల పాదయాత్ర లో పాల్గొన్నారు శ్యామల.

తాను మొదటి నుంచి వైఎస్‌ ఆర్‌ ఫ్యామిలీ అభిమానినని… అందుకే షర్మిల పాదయాత్రకు మద్దతు తెలిపానని చెప్పారు. కాగా… నేటితో వైఎస్‌ షర్మిల పాదయాత్ర 8 వ రోజుకు చేరుకోనుంది. ఇక ఇవాళ మహేశ్వరం నియోజక వర్గం తిమ్మాపూర్ విలేజ్ నుంచి 9.30కి పాదయాత్ర మొదలు పెట్టారు షర్మిల. రాచలూర్,గాజుల పురుగు తండా,బేగంపేట,మాదాపూర్ విలేజ్, లో పాదయాత్ర చేయనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news