సంచలన నిర్ణయం తీసుకున్న యాంకర్స్ సుమ, అనసూయ..!

-

అమితాబ్ బచ్చన్ వంటి టాప్ స్టార్ హీరోకు సైతం కరోనా సోకడంతో తెలుగు సినీ ఇండస్ట్రీతో పాటు టెలివిజన్ ఇండస్ట్రీలోని పలువురు షూటింగ్స్‌కు తాత్కాలికంగా గుడ్ బై చెబుతునున్నారు. ముఖ్యంగా టాలీవుడ్ టాప్ యాంకర్స్ అనసూయ, సుమ ప్రస్తుతం తాము చేస్తోన్న షూటింగ్స్‌కు గుడ్ బై చెప్పారట. ఇప్పటికే టీవీ పరిశ్రమలో పలువురుకి కరోనా సోకడంతో వీరిద్దరూ ఈ సంచలన నిర్ణయం తీసుకున్నారనే వార్తలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.

ప్రస్తుతం సుమ ‘క్యాష్’, అనసూయ ‘జబర్దస్త్’ షూటింగులు జరుపుకుంటున్నాయి. గత కొద్ది రోజులుగా వీరిద్దరూ తమ షోల షూటింగుల్లో పాల్గొంటున్నారు. అయితే, కొద్ది రోజులపాటు ఈ షూటింగ్‌లకు దూరంగా ఉండాలని సుమ, అనసూయ నిర్ణయం తీసుకున్నట్టు రూమర్లు వినిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో రిస్క్ తీసుకోవడం అనవసరమని భావించిన ఈ యాంకర్లు ఇంట్లోనే ఉండాలని నిర్ణయించుకున్నారట.

Read more RELATED
Recommended to you

Latest news