Andhra Pradesh : మైలవరం వైసీపీ ఎమ్మెల్యేకు బిగ్ షాక్..

-

మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్కు సీఎం జగన్ షాక్ ఇచ్చారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి ఆయనను తొలగించారు. వసంత స్థానంలో ZPTC తిరుపతిరావుకు పేరును జగన్ దాదాపు ఖరారు చేశారు. ఈమేరకు తిరుపతిరావు సీఎం జగన్ను కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఇప్పటికే అధిష్ఠానంపై అసంతృప్తితో ఉన్న కృష్ణప్రసాద్ దెందులూరులో జరిగే ‘సిద్ధం’ సభకు దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆయన తెలుగుదేశం పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది.

కాగా గత అసెంబ్లీ ఎన్నికల్లో వసంత కృష్ణ ప్రసాద్‌ మైలవరం నుంచి పోటీ చేయగా టీడీపీ అభ్యర్థి దేవినేని ఉమపై ఆయన గెలుపొందారు. మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండడంతో నియోజకవర్గంలో చేయించిన సర్వేల్లో వసంత కృష్ణప్రసాద్‌పై వ్యతిరేకత వచ్చినట్లు సమాచారం. దీంతో ఈసారి జరిగే ఎన్నికల్లో సీటు ఇవ్వమనే సంకేతాలు ఇప్పటికే వసంత కృష్ణ ప్రసాద్‌ కి అందినట్టు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news