ఏపీ కరోనా అప్డేట్ : కొత్తగా 1,439 కేసులు

-

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రం లో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. ఏపీ లో నిన్న తగ్గిన కరోనా కేసులు ఇవాళ మళ్లీ పెరిగాయి. తాజాగా ఏపీ వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1439 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఆంధ్ర ప్రదేశ్‌ లో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 20,26,042 కి పెరిగింది.

ఒక్క రోజు వ్యవధిలో మరో 14 మంది చనిపోవడంతో కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 13, 964 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 14, 624 యాక్టివ్‌ కరోనా కేసులు ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో 1311 మంది బాధితులు కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఇక ఇప్పటి దాకా కరోనా బారిన పడి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 19,97, 454 లక్షలకు చేరింది.ఇక నిన్న ఒక్క రోజే ఏపీలో 62, 856 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా ఇప్పటి దాకా 2, 71, 61, 870 కరోనా పరీక్షలు చేసినట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.

Read more RELATED
Recommended to you

Latest news