ఏపీ కరోనా అప్డేట్ : కొత్తగా 629 కేసులు

-

చైనాలో పురుడుపోసుకున్న కరోనా మహమ్మారి ఏపీని వదలడం లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు నిలకడ లేకుండా… ఒక రోజు పెరుగుతో మరొక రోజు తగ్గుతూ వస్తున్నాయి. ఇక తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం… ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 629 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఆంధ్ర ప్రదేశ్‌ లో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 20,56, 628 కి పెరిగింది.

ఒక్క రోజు వ్యవధిలో మరో 08 మంది చనిపోవడంతో కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 14,250 కి చేరింది. ఇక గడిచిన 24 గంటల్లో 797 మంది బాధితులు కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఇక ఇప్పటి దాకా కరోనా బారిన పడి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 20,34,244 లక్షలకు చేరింది. ఇక నిన్న ఒక్క రోజే ఏపీలో 45, 818 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా ఇప్పటి దాకా 2, 87, 06 , 629 కరోనా పరీక్షలు చేసినట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 8134 యాక్టివ్‌ కరోనా కేసులు ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news