ఏపీలో భారీగా తగ్గిన కరోనా.. కొత్తగా 739 కేసులు

-

చైనా లో పుట్టిన కరోనా మహమ్మారి ఆంధ్ర ప్రదేశ్‌ ను ఇప్పట్లో వదిలేలా లేదు. ఆంధ్ర ప్రదేశ్‌ లో మొన్నటి వరకు తగ్గిన కరోనా కేసులు.. ఇప్పుడు పెరిగి పోతున్నాయి. అయితే తాజాగా నిన్నటి కంటే ఈ రోజు కాస్త తగ్గాయి కరోనా కేసులు. తాజాగా ఏపీ వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 739 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఆంధ్ర ప్రదేశ్‌ లో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 20,22,064 కి పెరిగింది.

ఒక్క రోజు వ్యవధిలో మరో 14 మంది చనిపోవడంతో కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 13,925 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 14,550 యాక్టివ్‌ కరోనా కేసులు ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో 1333 మంది బాధితులు కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఇక నిన్న ఒక్క రోజే ఏపీలో 43, 594 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా ఇప్పటి దాకా 2,69, 82 , 681 కరోనా పరీక్షలు చేసినట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇక ఇప్పటి దాకా కరోనా బారిన పడి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 19,93,589 లక్షలకు చేరింది.

 

Read more RELATED
Recommended to you

Latest news