ఏపీలో కొత్తగా 286 కరోనా కేసులు…3 మరణాలు నమోదు

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి కేసులు ఓ రోజు పెరుగుతూ… ఓ రోజు తగ్గుతూ వస్తున్నాయి. అయితే నిన్నటి కంటే ఇవాల్టి రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం… … ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 286 కరోనా కేసులు నమోదు అయ్యాయి.

దీంతో ఆంధ్ర ప్రదేశ్‌ లో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 20,69, 352 కి పెరిగింది. ఒక్క రోజు వ్యవధిలో మరో ముగ్గురు చనిపోవడంతో కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 14, 409 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 3196 యాక్టివ్‌ కరోనా కేసులు ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో 307 మంది బాధితులు కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఇక ఇప్పటి దాకా కరోనా బారిన పడి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 20,51 , 747 లక్షలకు చేరింది. ఇక నిన్న ఒక్క రోజే ఏపీలో 37 , 540 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా ఇప్పటి దాకా 2, 98 , 84 , 230 కరోనా పరీక్షలు చేసినట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.

Read more RELATED
Recommended to you

Latest news